తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే .
ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ,బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రరావు ,టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొన్నారు .
ఈ సందర్బంగా కోదండరాం మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాకుండా కాలాన్ని గడుఁపుతున్న నిరుద్యోగ యువత టీఆర్ ఎస్ సర్కారు కు గుణపాఠం చెప్పాలి అని ఆయన పిలుపునిచ్చారు ..