తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేలలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే .టీడీపీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కారేక్కేశారు .తాజాగా ఆ పార్టీకి చెందిన కింది స్థాయి క్యాడర్ అంతా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు .అందులో భాగంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరడంతో జిల్లాలో టీడీపీ బలహీనపడింది .
దీంతో ఉన్న నేతలంతా మంత్రి తుమ్మల వెంట టీఆర్ఎస్ గూటికి చేరారు అప్పట్లో .ఇక ఉన్న చిన్న చితక నేతలంతా రేపో మాపో అన్నట్లు గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు .అందులో భాగంగా దుమ్ముగూడెం మండలానికి చెందిన టీడీపీ నేతలంతా మంత్రి తుమ్మల సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు .
వీరిలో మండల టీడీపీ అధ్యక్షుడు కొత్తూరి సీతారామారావు తన అనుచరవర్గం అయిన పెదనల్లబల్లి టీడీపీ ఉపసర్పంచ్ ఊడుగుల శోభారాణి ,దుమ్ముగూడెం మాజీ సర్పంచ్ రామయ్య ,చలిగంజి వెంకటేశ్వర్లు ,కల్లూరి రవి ,కుప్పిలి చిట్టిబాబు ,జెట్టి శ్రీను ,బోరం చంద్రయ్య ,కోడిశెట్టి చంద్రం ,బూరం శ్రీనివాస్ ,నాగం వెంకటేష్ ,సున్నం వెంకటేష్ ,పాయం వెంకటేష్,కుర్ణం శ్రీను ,తాము పార్వతీ ,కుంజా లక్ష్మీ ,జలకం లక్ష్మీ లతో పాటు దుమ్ముగూడెం ,సింగవరం ,దబ్బనూతల ,పెదనల్లబల్లి ,రేగుబల్లి ,కొత్తపల్లి గ్రామాల పంచాయితీకి చెందిన టీడీపీ క్యాడర్ అంతా మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు .దీంతో దుమ్ముగూడెం మండలంలో ఉన్న టీడీపీ పార్టీ దాదాపు కనుమరుగు అయిపోయింది .ప్రస్తుతం దుమ్ముగూడెం మండలం అంతా టీఆర్ఎస్ అడ్డగా మారింది .