టీం ఇండియా కెప్టెన్ ,వరసగా రికార్డుల మోత మోగిస్తున్న విరాట్ కోహ్లీ మరో రికార్డుకు దగ్గరలో ఉన్నారు .ఇప్పటికే ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ కేవలం పాంటింగ్ కు సాధ్యమైన రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు .
అప్పట్లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో ఆసీస్ మాజీ కెప్టెన్ ఇటు టెస్టు,వన్డే ,ట్వంటీ ట్వంటీ ఇలా మూడు ఫార్మాట్ లో ఒకేసారిగా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు .ఇటివల గురువారం ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్ లో కోహ్లీ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు .అయితే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ కు కోహ్లీ కు మధ్య ఉన్న తేడా కేవలం నలబై ఐదు పాయింట్లు మాత్రమే .త్వరలో జరగనున్న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్ లో కోహ్లీ రాణిస్తే ఆయన అగ్రస్థానానికి చేరడం ఖాయం ..