గేమింగ్ హబ్గా తెలంగాణ మారుతున్నదని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు పాల్గొనడం సంతోషకరమన్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్పీరియన్స్ చేశారు.
Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect 2017 along with @Vishaldhupar, MD @nvidia at Gachibowli Indoor Stadium, Hyderabad. pic.twitter.com/PMXH8j4JOH
— Min IT, Telangana (@MinIT_Telangana) December 9, 2017
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో సగం జనాభా 27 సంవత్సరాలలోపు ఉన్నవారేనని తెలిపారు. రాబోయే రోజుల్లో గేమింగ్ ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ ఉందని తెలిపారు. గేమింగ్, మల్టీమీడియా రంగాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. గేమింగ్, విసువల్ ఎఫెక్ట్, మల్టీమీడియా రంగాల అభివృద్ధికి ఇమేజ్ టవర్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. గేమింగ్ సెక్టార్ తెలంగాణ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గేమింగ్ షో ప్రతీ సంవత్సం నిర్వహించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా గేమింగ్ ఇండస్ట్రీమంచి డిమాండ్ ఉందన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ గేమింగ్ హబ్గా ఎదుగుతున్నదని సంతోషం వ్యక్తం చేశారు.
Minister @KTRTRS getting a hands on experience at the demo stations at #GamerConnect 2017. pic.twitter.com/ocnluFzSDK
— Min IT, Telangana (@MinIT_Telangana) December 9, 2017