Home / SLIDER / నోరూరించే తెలంగాణ రుచులతో.. తెలుగు మహాసభలు..!

నోరూరించే తెలంగాణ రుచులతో.. తెలుగు మహాసభలు..!

తెలంగాణలో వెలుగొందిన తెలుగు వైభవం, ప్రశస్తిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఈనెల 15 నుంచి 19 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక౦గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి తెలుగు భాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొననున్నారు .

ఈ నేపధ్యంలో వారికీ తెలంగాణ వంటకాల రుచులు చూపించనున్నారు .దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన వంటకాలనింటిని అతిధులకు వడ్డించే౦దుకు సన్నాహాలు చేస్తున్నారు . మారుమూల ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన ఏ వంటకం ఉన్నా… దానికి తెలుగు మహాసభల మెనూలో చోటు దక్కనుంది.తెలంగాణ స్పెషల్ వంటకాలు అంటే… ముఖ్యంగా అందరికి బిర్యానీ గుర్తొస్తుంది. ఆ తర్వాత హలీం, అంకాపూర్‌ చికెన్‌, నాటుకోడి, రాగుల అంబలి, జున్ను, పచ్చిపులుసు అన్నం, గుత్తి వంకాయకూర , పుంటికూర కోడి బిర్యానీ, రాగిసంకటిలాంటివి చాలా ఉంటాయి. సర్వపిండి, సకినాలు, పల్లిగారెలు, చెగోడిలు, మురుకులు, నువ్వుల అరిసెలు, మురుమురాల లడ్డులు లాంటి చితుతిళ్లను కూడా ఈ సారి అందరికీ రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం . మొత్తానికి తెలుగు సాహిత్యంతో పాటు తెలంగాణ వంటకాలకి కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం రావాలని తెలంగాణ సర్కార్ ఆశిస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat