ఏపీ అధికార పార్టీ టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు కాపు సెగ అప్పుడే తగిలింది .ఇటివల జరిగిన ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు,కాపులను బీసీల్లో చేరుస్తూ బిల్లును ఆమోదించిన సంగతి తెల్సిందే .అయితే గత నాలుగు ఏండ్లు కాపు రిజర్వేషన్లకు దూరంగా ఉంటూ వచ్చి మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో రిజర్వేషన్లు కల్పిస్తామని ముందుకు రావడం పై రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గం నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది .
అందులో భాగంగా పలు చోట్ల ధర్నాలకు ,నిరసనలకు దిగుతున్నారు .తాజాగా తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ,బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు .ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుతో కాపులను బీసీల్లో చేరిస్తే తమకు అన్యాయం జరుగుతుంది .బీసీ వర్గానికి అన్యాయం జరిగితే టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను ..
నేను ఒక్కడ్నే కాదు ఏకంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ టీడీపీ నేతలందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తాం ..మా దారి మేము చూసుకుంటామని చెప్పినట్లు సమాచారం .దీనికి ఒక్కసారిగా కంగు తిన్న చంద్రబాబు పార్టీ ఒకరి మీద ఆధారపడి ఉండదు .ఉండేవాళ్ళు ఉంటారు .పోయేవాళ్ళు పోతారు .పార్టీ నుండి వెళ్ళిపోయిన నేతలను తయారుచేసే శక్తి తనకు ఉన్నట్లు రొటీన్ డైలాగ్ కొట్టినట్లు ఆర్ కృష్ణయ్య వర్గం అంటున్నారు .