సాధారణంగా రైలు పట్టాలపై పడి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటుంటారు.అయితే ఘట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిన్న ఉదయం ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది .రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి శవం పట్టాలపై పడి ఉండగా … అదే సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్ళుతున్న లోకల్ ట్రైన్ డ్రైవర్ తన రైలు కింద ఆత్మహత్య చేసుకుంటున్నాడని భావించి రైలు ఆపి కోపంతో కొందికి దిగాడు . తీరా రైలు దిగి చూస్తే అతను ముందుగానే చనిపోయి ఉన్నాడు అంటే అది శవం. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే దగ్గరలోని రైల్వే గ్యాంగ్ మెన్ ను పిలిచి శవాన్ని పక్కన బెట్టి వెళ్లిపోయాడు. గ్యాంగ్మెన్ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు ఎవరన్న హత్యా చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు