సినీ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న ఆయన భార్య వనితతో పాటు మరో ఇద్దరిపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.విజయ్ ఆత్మహత్య కేసులో విజయ్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వనితతో పాటు న్యాయవాది శ్రీనివాస్, శశిధర్లపైనా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.