ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 నుండి 19 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే… ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు .వేదికలకు వెళ్లే దారులు.. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు.. భవంతుల సముదాయాలు.. ఇలా ఒకటేమిటి.. నగరం అంతా విద్యుత్ కాంతులతో శోభాయమానంగా మర్చుచున్నారు .
తెలుగు మహాసభలకు విశిష్ట తను , గొప్పతనాన్నిప్రపంచానికి తెలియజేసే విధంగా నగరంలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తోరణాలకు మధ్య భాగంలో తెలంగాణ తల్లి ప్రతిమను ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ఒక మహనీయుడి పేరుతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు.