యావత్తు దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న గుజరాత్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేటితో ముగిశాయి .గుజరాత్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గురువారం సాయంత్రంతో పోలింగ్ ముగిసింది .ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ,త్వరలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టనున్న రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు .అయితే తాజాగా నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా కాషాయం జెండా ఎగరనున్నది అని తేలింది .
దేశంలో పలు ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి . పలు ఛానల్స్ నిర్వహించిన ఫలితాలు .ఐబీఎన్-సీఎన్ఎన్ నిర్వహించిన పోల్స్ లో బీజేపీ పార్టీకి 109 స్థానాలు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై స్థానాలు ,ఇతర్లు మూడు చోట్ల గెలుపొందుతారు అని తేలింది .ఇక టైమ్స్ నౌవీఎంఆర్ నిర్వహించిన పోల్స్ లో బీజేపీ పార్టీకి నూట తొమ్మిది స్థానాలు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ,ఇతరులకు మూడు స్థానాల్లో గెలవనున్నట్లు తెల్పింది .
ఏబీపీ -సీఎస్డీఎస్ సర్వేలో బీజేపీ పార్టీకి తొంబై ఒక్కటి నుండి తొంబై తొమ్మిది వరకు ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఎనిమిది నుండి ఎనబై ఆరు వరకు ,ఇతరులు ఏడు నుండి ఎనిమిది మధ్య రావచ్చు అని తేలింది .మరోవైపు రిపబ్లిక్ -సీఓటర్ సర్వేలో బీజేపీ కి నూట ఎనిమిది ,కాంగ్రెస్ పార్టీకి డెబ్బై నాలుగు స్థానాలు వస్తాయి అని తేల్చేసింది .అయితే గుజరాత్ ఫలితాలు ఈ నెల 18న వెలువడునున్నాయి ..