విజయవాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కాగా, క్రికెట్ బెట్టింగ్కు సంబంధించి వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మీడియాకు వెల్లడించారు. వీరు ప్రస్తుతం బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న బీపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఇక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకుని నున్న, అజిత్సింగ్ నగర్, సత్యనారాయణపురం పోలీసులు సంయుక్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు.
అయితే, నిందితులు పలు యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా బెట్టింగ్లు కడుతున్నట్లు గుర్తించామని, అలాగే, ఎల్సీఈఎక్స్సీహెచ్, క్రికెట్ లైవ్ లైన్, క్రిక్ బజ్ వంటి యాప్ల ద్వారా సబ్ బుకీలను సంప్రదిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు. ఈ దాడుల్లో యల్లపు శ్రీనివాస్, పోతుల పూర్ణచంద్రరావుతోపాటు 11 మంది సబ్ బుకీలు అరెస్టు చేశామని చెప్పారు. అలాగే, నిందితుల నుంచి 24 సెల్ఫోన్లు, ఒక ల్యాప్టాప్ సహా రూ.9,800 నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు సీపీ సవాంగ్.