దంగల్’ నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులకు గురైయ్యినాని చేప్పిన సంగతి తెలిసిందే. . తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.ఢిల్లీ – ముంబై ఫ్లైట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణమైన అనుభవంపై తన ఆవేదనను ఆమె గత వారంలో సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వివరాలను తెలిపారు.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు స్పందిస్తూ.. విమానాల్లో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత కీలకమని, ఎక్కడైనా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణం చర్యలు తీసుకుంటున్నామన్నారు. పబ్లిసిటీ కోసం కొందరు సెలెబ్రిటీలు విమానాల్లో తమకేదో జరిగిపోతోందని ఆరోపిస్తున్నారని అశోక్ గజపతి రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విమానాల్లో వేధింపులు అత్యంత అరుదని, ఏ తప్పు చేసినా శిక్ష తీవ్రంగా ఉంటుందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో జైరా అసత్యాలు చెప్పాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వేధింపులు జరిగిన మాట నిజమేనని బాధితురాలు చెప్తుంటే సాక్షులు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి లాంటి వారు కూడా ఆమెను వ్యతిరేకంగా కామెంట్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు.