టాలీవుడ్ ఇండస్ట్రీలో పీకే ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సినిమా ఫ్యాన్స్ దగ్గర నుండి రాజకీయ పార్టీలకు చెందిన నేతల వరకు ఎవరు ఏ ఒక్క విమర్శ చేసిన కానీ రెప్పపాటులో ప్రతివిమర్శలు చేస్తున్నారు .కనీసం ఈగను కూడా వాలనీయడంలేదు .అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటివల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించడానికి వెళ్ళిన సంగతి తెల్సిందే .
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపుకు సహకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శల పర్వం కురిపించాడు .చంద్రబాబు మాట్లాడుతూ “ప్రాజెక్టు కట్టడం అంటే ఏమిటో తెలియని వాళ్ళు ..సిమెంట్ కి కాంక్రీట్ కు తేడా తెలియని వాళ్ళు ..ప్రాజెక్టు లోపల సిమెంట్ ఎందుకు వేస్తారో కూడా తెలియని వాళ్ళు పోలవరం మీద విమర్శలు కురిపిస్తున్నారు .అసలు మొహాలకు రంగులు వేసుకునేవారికి రంగులు గురించి తప్ప సిమెంట్ గురించి ఏమి తెలుసు .
వాళ్ళను కిందకు పంపిస్తే ఏమి చేయాలనీ అడుగుతారు అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు .అయితే అంతకుముందే పర్యటించిన పవన్ మాట్లాడుతూ పోలవరం ఎందుకు ఆలస్యం అవుతుంది .ఎక్కడ చూసిన కానీ సిమెంట్ పనులే తప్ప ప్రాజెక్టు నిర్మాణాలు ఏమి జరగడం లేదు అంటూ బాబు పై విమర్శలు కురిపించిన సంగతి తెల్సిందే .అయితే పవన్ పై వైసీపీ అధినేత జగన్ దగ్గర నుండి కింది స్థాయి నేత వరకు విమర్శలు చేస్తే టీవీలలో ,సోషల్ మీడియా లో లైవ్ లు పెట్టి మరి విమర్శలు కురిపించే వాళ్ళు బాబు వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి ..