Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబుకు న‌యా షాక్.. ప‌ట్టు బిగించిన ఏసీబీ..!

చంద్ర‌బాబుకు న‌యా షాక్.. ప‌ట్టు బిగించిన ఏసీబీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు నయా షాక్ త‌గ‌ల‌నుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు పై ఏసీబీ అధికారులు మ‌రో రెండు కేసులు నమోదు చేసేందుకు రెడీ అయిపోయారు. బొల్లినేని రామారావు తొలినుంచి కొంత వివాదాస్పదంగా మారారు. మహారాష్ట్రలో కాంట్రాక్టులు తీసుకున్న ఆయన అక్కడ అవినీతికి పాల్పడ్డారని మహారాష్ట్ర ఏసీబీ శాఖ నాలుగు కేసులు నమోదు చేసింది. దీని పై మహారాష్ట్ర ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలోని నీటిపారుదల శాఖలో బొల్లినేని రామారావుకు సంబంధించిన సంస్థ బొల్లినేని కన్స స్ట్రక్షన్స్ కాంట్రాక్టులను తీసుకుంది. ఈ పనుల్లో భారీగా అవినీతి జరగడంతో ఏసీబీ ఎమ్మెల్యేపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది.

ఇక గ‌త కొంత కాలంగా నెలుల‌ బొల్లినేని రామారావు తమకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారని మహారాష్ట్ర ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఎన్నిసార్లు ఎమ్మెల్యేను విచారణ కోసం ప్రయత్నించినా ఆయన దొరకడం లేదని చెబుతున్నారు. దీంతో ఆయన పై మరో రెండు కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. అయితే అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మ‌రో సమస్య వచ్చిపడింది. అదే జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి పై సీబీఐ విచారణ చేపట్టగానే ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. అలాగే మరో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని కూడా భూవివాదాల్లో చిక్కుకున్నారని ఆయన్ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ రెండు స్పస్పెన్షన్లను స్వ‌యంగా టీడీపీ అధినేత చంద్రబాబే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో బొల్లినేని విషయంలో చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో అని టీడీపీ వ‌ర్గీయుల్లోనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. దీంతో న్యూఇయ‌ర్ లోపు చంద్ర‌బాబుకు న‌యా షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat