తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేటి నుండి పంతొమ్మిది తేది వరకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో ఘనంగా నిర్వహించనున్న సంగతి తెల్సిందే .ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు యాబై వేలమంది హాజరు కానున్నారు అని సమాచారం .
అయితే ఇంతఘనంగా జరుగుతున్న మహాసభల్లో అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ దివంగత ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన ఎన్టీఆర్ బొమ్మ పెట్టనందుకు ఎన్టీఆర్ అభిమాని వింతైన రీతిలో నిరసనకు దిగారు .ఆలిండియా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అయిన వడ్దేల్లి సాంబశివరావు ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతమైన జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఉన్న జాతీయ రహదారిపై నిరసన తెలిపారు .ఈ సందర్భంగా మరో అభిమాని దుర్గంపూడి రాంబాబు గుండు గీయించుకొని మరో నిరసన తెలిపారు ..