ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. పాదయాత్ర చేస్తున్న ఆయనకు దారి పొడువునా ప్రజలు తమ సమస్యలు విన్నవించి పరిష్కారం చూపాలని కోరుతున్నారు. శనివారం వైఎస్ జగన్ 36వ రోజా పాదయాత్ర అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ బాధలు జగన్ కు చెప్పుకున్నారు.
ఈ క్రమంలో బడన్నపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త చెన్నారెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. పాదయాత్రలో భాగంగా ధర్మవరం మండలం బడన్నపల్లెకు చేరుకున్న ఆయన..చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అంతేగాక మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఏంతో సంతోషంతో ఆ కుటుంబం ఆనందంతో 2019లోనే కాదు మేము బ్రతికి ఉండే వరకు వైసీపీలోనే ..నీ వేంటనే నడుస్తామని అన్నారు.