Home / TELANGANA / మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..

మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం-మంత్రి కేటీఆర్ పిలుపు..

తెలంగాణ రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ మహానగరంలో కుత్బుల్లాపూర్ వేదికగా జరుగుతున్న హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలోపాల్గొన్నారు . ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని ఐటీ, స్పష్టం చేశారు.

అయితే ఈ కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తేల్చిచెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు. స్వీయ నియంత్రణతోనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు.

రాబోయే 10-20 ఏండ్లలో హైదరాబాద్ జనాభా రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో జనాభా అవసరాలకు తగ్గట్టుగా నగరాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే సర్కిళ్లను పెంచామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసమే సర్కిళ్లను పెంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat