ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వియ్యంకుడు ,రాష్ట్రంలో హిందూపురం అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తాను ఓడిపోతే కనుక అరగుండు చేయించుకుని నడి వీధుల్లో ఊరేగుతానంటూ వైసీపీ నేత నవీన్ నిశ్చల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘ఐడ్రీమ్’లో నవీన్ నిశ్చల్ తో నిర్వహించిన ఇంటర్వ్యూ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి ‘ఐడ్రీమ్’ ప్రోమోను విడుదల చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశం వస్తే కనుక బాలకృష్ణపై నెగ్గుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై పలు విమర్శలు చేశారు. ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేశారని, బాలకృష్ణ గెలుపు గెలుపే కాదని ఆ ప్రోమోలో ఆయన విమర్శలు గుప్పించారు.