తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల ,మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపుతో ఊరు ఊరంతా కదిలింది .అంతే కాకుండా యావత్తు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది .ఇంతకూ అసలు విషయం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే వ్యవసాయ రంగానికి టీఆర్ఎస్ సర్కారు తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్న సంగతి తెల్సిందే .
ఆ తర్వాత ఏడాదిన్నర తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ను అందిస్తుంది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు .అందులో భాగంగా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తుండటంతో అన్నదాతలు ఆటో స్టార్టర్లను స్వచ్చందంగా తొలగించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటివల పిలుపునిచ్చారు .
మంత్రి హరీష్ రావు తన సొంత నియోజక వర్గమైన సిద్దిపేటలో పర్యటించారు .ఈ క్రమంలో మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతన్నలు ఆటో స్టార్టర్లను తొలగించాలని పిలుపునిచ్చారు .దీంతో సిద్ధిపేట రూరల్ మండలంలో బంజేరుపల్లి గ్రామానికి చెందిన రైతన్నలు స్పందించారు .తమ గ్రామంలోని రైతన్నలు తమ పొలాల్లో ఉన్న ఆటో స్టార్టర్లను తొలగించి యావత్తు రాష్ట్రంలోనే ఆటో స్టార్టర్లను తొలగించిన తొలి గ్రామంగా రికార్డును సొంతం చేసుకున్నారు .మంత్రి హరీష్ పిలుపుతో ఆటో స్టార్టర్లను తొలగించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు …