Home / SLIDER / అంగరంగ వైభవంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం..!

అంగరంగ వైభవంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తోటబావి వద్ద నూతనంగా నిర్మించిన కల్యాణ మండపంలో ఉదయం 10.45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది.

Image may contain: 1 person, indoor

ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టువస్ర్తాలను సమర్పించారు. కల్యాణోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర ఉప శాసన సభాపతి పద్మాదేవేందర్ రెడ్డి, ప్రభుత్వ ఛీఫ్ విప్ వెంకటేశ్వర్లు, జెడ్పీ రాజమణి, జనగామ ఎమ్మెల్యే యాదిరెడ్డి, ఆలయ శాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. పాల్గొన్నారు.

Image may contain: 3 people, people standing

కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..గోదావరి జలాలతో కొమురవెళ్లి మల్లన్న స్వామి పాదాలకు అభిషేకం చేస్తామని పేర్కొన్నారు.స్వామి వారి దయతో వచ్చే ఏడాది మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హరీష్‌రావు చెప్పారు. మల్లన్న స్వామి దీవెనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామి అనుగ్రహంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శ రాష్ట్రంగా నిలివాలని కోరుకున్నారు.

Image may contain: 20 people

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat