బాహుబలి సినిమా తరువాత యాక్షన్ తరహా సినిమాతో అభిమానులను మురిపించేందుకు ప్రభాస్ సాహోతో సిద్ధమవుతున్నాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ సుజిత్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శద్ధా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ప్రభాస్, శ్రద్ధా కపూర్ల మధ్య జరుగుతున్న ఆన్లైన్ వ్యవహారంపై ఇప్పుడు అటు బాలీవుడ్డు, ఇటు టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
ఇందుకు కారణం ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ చెప్పిన మాటలే.. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని, అయితే, సినీ సెట్లో ఉన్నప్పుడు ప్రభాస్ చేసే అల్లరి తనకెంతో నచ్చుతుందంటూ చెప్పుకొచ్చింది. మేమిద్దరం ఫోన్ టచ్లో ఉంటామని, సాహో గురించే ఎక్కువ మాట్లాడుకుంటామని, అంతేగాక సెట్లో ఉన్నప్పుడు ప్రభాస్ తనకు కూడా భోజనం తెప్పిస్తాడని, అందులో ఎగ్ఫ్రై, చేపల పులుసు ఉండేలా చూస్తాడని, అవి తిన్న తరువాత నేను ఆ ఫుడ్కు ఫ్యాన్ అయిపోయానంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఈ ఇంటర్వ్యూ కాస్తా చూసిన సినీజనం.. ఫోన్లో ముచ్చట్లు, సెట్లో చిరునవ్వులు చిందిస్తూ.. భోజనం వడ్డించేంత వరకు వ్యవహారం వచ్చిందా..!! అంటూ సోషల్ మీడియాలో వీరి ఫోటోలకు కామెంట్లు పెట్టేస్తున్నారు.