Home / ANDHRAPRADESH / జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

జగన్ ప్లాన్ సూపర్ ..ఆ టీడీపీ ఎంపీకి ధీటుగా అభ్యర్ధి ఖరారు ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 125 నియోజకవర్గాల్లో మూడు వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .

ఈ క్రమంలో రాష్ట్రంలో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేశారని వైసీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు .ప్రస్తుతం శ్రీకాకుళం టీడీపీ ఎంపీగా ఉన్న యువనాయకుడు ,ఉత్తరాంధ్ర నేత ,దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడైన రామ్మోహన్ నాయుడుపై వైసీపీ ఎంపీ అభ్యర్ధిని జగన్ ఖరారు చేశారు .

అందులో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటు నియోజక వర్గ ఇంచార్జ్ గా ఉన్న మాజీ మంత్రి ,సీనియర్ నాయకుడు అయిన తమ్మినేని సీతారం ఈ స్థానం నుండి ఆయన విముఖత చూపడంతో వేరే అభ్యర్ధిని జగన్ సెలెక్ట్ చేశారు అంట .ఈ క్రమంలో జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న నేత ధర్మాన కుటుంబానికి కేటాయించారు .ఇందులో భాగంగా ధర్మాన ప్రసాదరావును ఎంపీగా ,ఆయన సోదరుడు ఎమ్మెల్యేగా బరిలోకి దించాలని జగన్ యోచిస్తున్నారు అని వైసీపీ శ్రేణులు అంటున్నారు .ధర్మాన కుటుంబానికి ఇటు పేరు ప్రఖ్యాతలు అటు ఆర్థికంగా బలంగా ఉండటంతో ప్రస్తుత ఎంపీ రామ్మోహన్ మీద గెలవడం ఖాయమంటున్నారు వైసీపీ శ్రేణులు .చూడాలి మరి జగన్ వీరిద్దరిలో ఒకర్ని నిలుపుతారో లేదో ..?

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat