వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ముప్పై ఎనిమిది రోజులుగా రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అనంతపురం జిల్లాలో జగన్ కు విభిన్న వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకుపోతున్నారు .
దాదాపు ముప్పై ఎనిమిది రోజు పాదయాత్ర చేస్తున్న జగన్ పంట పొలాల్లోకి వెళ్లి మరి రైతులను ,రైతు కూలీలను పలకరిస్తూ వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు .ఈ నేపథ్యంలో రోడ్డు పక్కనే నిస్సహాయంగా ఉన్న ఒక వృద్ధురాలిని చూడగానే జగన్ ఆమె వద్దకు వెళ్లారు .ఈ క్రమంలో ఆమె బాధలను అడిగి మరి తెలుసుకున్నారు .
వృద్ధురాలి బాధను ,తాజా పరిస్థితిని చూసి జగన్ చలించిపోయాడు.ఈ క్రమంలో జగన్ ధర్మవరం నియోజక వర్గ వైసీపీ సమన్వయకర్త అయిన కే వెంకట్రామి రెడ్డికి ముందు ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించాలని ..ఆ తర్వాత ఆ నిస్సహాయురాలిని ధర్మవరం వృద్ధాశ్రమంలో చేర్పించాలని ఆదేశించాడు .ఒక వృద్ధురాలిని కలవడమే కాకుండా ఆమె కష్టనష్టాలను అడిగి మరి తెలుసుకొని సరైన వైద్యమందించి .వృద్ధాశ్రమంలో చేర్పించిన జగన్ ను చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు .