గత కొన్ని రోజులక్రిందట తెలుగుదేశం పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేసి లీడర్ కావాలని రేవంత్రెడ్డి ఆశపడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. నైతికత గురించి రేవంత్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. రేవంత్కు ధైర్యముంటే కొడంగల్లో గెలిచి చూపించాలని సవాలు విసిరారు. గుజరాత్, హిమాచల్ ఫలితాలతో కాంగ్రెస్కు మరోసారి దిమ్మతిరిగిందని అయన ఎద్దేవా చేశారు.