ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి.. మాయమాటలతో అధికారాన్ని చేపట్టిన చంద్రబాబుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. అందులోనూ నాడు జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓ వైపు బీజేపీ.. మరో వైపు జనసేన అధినేతలతో జతకట్టి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొనసాగిస్తున్న చంద్రబాబుకు మె మెల్లగా దూరం జరిగే పనిలో పడ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు.
దీనికి అసలు కారణాలను పరిశీలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడం ఒక కారణం కాగా.. మరో వైపు బీజేపీ, జనసేన ఈ రెండు పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్కు మళ్లీ అధికారం చేపట్టే అవకాశం తక్కువనే చెప్పక దప్పదు.
మరో వైపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రతో .. చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తూ.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో.. ఎలా చేస్తానో అన్ని క్లుప్తంగా ప్రజలకు వివరిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుత రాజకీయాలతోపాటు.. భవిష్యత్ రాజకీయాలపై కూడా ప్రజా ప్రతినిధులు ఒక అంచనా వేస్తూనే ఉంటారన్న విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు.. తిరిగి సొంత పార్టీకి వచ్చేందుకు రెడీ అవుతున్నారట. తమ రాజకీయ భవిష్యత్పై ఓ అంచనాకు వచ్చిన వారు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి భవిష్యత్ ఉండదని గమనించిన వారు ఈ నిర్ణయం తీసురున్నట్లు సమాచారం.
అంతేగాక, చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై కాకుండా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలుపైనే దృష్టిపెట్టి, అంతటితో ఆగక కేంద్ర నుంచి రాష్ట్ర అభివృద్ది కోసం మంజూరైన నిధులను సైతం ఎమ్మెల్యేల కొనుగోలుకే ఉపయోగించడంతో ఈ విషయాలన్నింటిని నిశితంగా గమనించిన ప్రజల్లో తీవ్రత పెంచుకుంది చంద్రబాబు సర్కార్. నాడు చంద్రబాబు వేసిన ఎత్తేలే.. ఇప్పుడు పెద్ద ముప్పుకాబోతున్నాయని గమనించిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీ గూటికి చేరుతారని, ఇప్పుడు ఈ అంశమే ఏపీ రాజకీయంలో హాట్ టాపిక్ అయింది.