Home / BUSINESS / డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

డిసెంబర్‌ 31 తర్వాత వాట్సప్‌ పనిచేయదని కంపెనీ…?

డిసెంబర్‌ 31, 2017 తర్వాత మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ కొన్ని ఫ్లాట్‌ఫాంలపై పనిచేయదు. ఈ విషయాన్ని కంపెనీ ధృవీకరించింది. బ్లాక్‌బెర్రీ ఓఎస్‌, బ్లాక్‌బెర్రీ 10, విండోస్‌ ఫోన్‌ 8.0, దాని కంటే పాత ఫ్లాట్‌ఫాంలకు వాట్సప్‌ తన సేవలను నిలిపివేస్తున్నట్లు సోమవారం తెలిపింది. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్‌డేట్స్‌ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా పనిచేయకపోవడం ఆగిపోవచ్చునని వెల్లడించింది. భవిష్యత్తులో తమ యాప్‌ ఫీచర్లను ఇంకా అభివృద్ధి చేద్దామనుకుంటున్నామని కానీ ఈ ఫ్లాట్‌ఫాంలకు అంత సామర్థ్యత లేదని చెప్పింది.

ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు వెంటనే కొత్త ఓఎస్‌ వెర్షన్‌(ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ 4.0+, ఐఫోన్‌ ఓఎస్‌ 7+, విండోస్‌ ఫోన్‌ 8.1+)లోకి అప్‌గ్రేడ్‌ కావాలని సూచించారు. అప్పుడే మీరు వాట్సప్‌ను వినియోగించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. నోకియా ఎస్‌40లో డిసెంబర్‌ 2018 తర్వాత, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 2.3.7, దాని కంటే పాత ఓఎస్‌ వెర్షన్‌లు ఫిబ్రవరి 1, 2020 తర్వాత వాట్సప్‌ సరిగా పనిచేయదని వాట్సప్‌ కంపెనీ తెలిపింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat