వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నలబై నాలుగు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ ప్రస్తుతం మంత్రి పరిటాల సునీత ఇలాఖ అనంతపురం జిల్లా కదిరి అసెంబ్లీ నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు .
పాదయాత్రలో భాగంగా ఈ రోజు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ,విజయవాడ తూర్పు నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఆ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు .నియోజక వర్గంలో గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ క్రమంలో రంగా సేవలను స్మరించుకొని రంగా సాక్షిగా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేస్తామని ఆయన అన్నారు ..