Home / ANDHRAPRADESH / సాయంత్రం చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఏంట్రీ….టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి

సాయంత్రం చిత్తూరు జిల్లాలోకి జగన్ పాదయాత్ర ఏంట్రీ….టీడీపీ సీనియర్ నేత వైసీపీలోకి

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు లో ఆ పార్టీకి బిగ్ షాక్ తగలనున్నది .అందులో భాగంగా జిల్లా అధికార టీడీపీ పార్టీలో వర్గ పోరు ,ఆధిపత్య జోరు ఊపందుకున్నాయి .ఈ క్రమంలో పార్టీకి చెందిన సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ త్వరలోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని జిల్లా రాజకీయ వర్గాల్లో కోడై కూస్తున్నాయి .రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని దక్కించుకున్న తర్వాత నిన్న మొన్నటి వరకు పలమనేరు అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఇంచార్జ్ అయిన చంద్రబోస్ పెత్తనం బాగానే సాగింది.

అయితే ఎప్పుడు అయితే వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అమర్ నాథ రెడ్డి వర్గం పోరు ముందు బోస్ వర్గం తీవ్ర అవమానాలకు గురవుతూ వస్తుంది .ఎప్పటి నుండో పార్టీను అంటిపెట్టుకొని ఉంటూ పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నబోస్ వర్గానికి వైసీపీ తరపున నుండు వచ్చిన వారు పెత్తనం చెలాయించడం నచ్చడంలేదు .ఏ అధికారక కార్యక్రమమైన కానీ పార్టీ కార్యక్రమమైన కానీ బోస్ వర్గానికి కనీసం సమాచారం ఇవ్వకుండా తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నాడు అమర్ నాథ్ రెడ్డి .దీంతో విసిపోయి ఉన్న బోస్ వర్గానికి షాకిస్తూ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బోసును నియోజక వర్గ ఇంచార్జ్ బాధ్యతల్ నుండి తప్పించడమే కాకుండా ఏకంగా వచ్చే ఎన్నికల్లో సీటు ఒవ్వడంలేదు అని పరోక్ష సంకేతాలు ఇస్తూ ఐటీ దాడులను నిర్వహించేలా ప్రణాళికలు చేశాడు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి గత ఎన్నికల్లో 93 వేల ఓట్లు సాధించిన బోస్‌కు ఇపుడు 2019లో టికెట్ ఇస్తారనే నమ్మకమే లేకుండా పోవడంతో వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు అని టాక్ .త్వరలో పాదయాత్రలో భాగంగా జిల్లాలో అడుగుపెట్టనున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అని జిల్లా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat