2019లో ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిందేనని పట్టుదలగా ఉన్నఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ విపరీతంగా హామీలు గుప్పిస్తున్నారు. అందులో ఆకర్షణీయమైంది.. 45 ఏళ్లకే పెన్షన్ పథకం. ఇప్పటివరకూ అది 60 ఏళ్లు నిండినవారికి ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే.. 45 ఏళ్లు నిండితే చాలు పెన్షన్ ఇస్తానంటున్నారు. అయితే ఇందులనూ చిన్న మెలిక ఉంది. ఈ 45 ఏళ్ల నిబంధన ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీలకు మాత్రమే. మిగిలిన వారికి ఎప్పటిలాగానే 60 ఏళ్లకే పెన్షన్ ఇస్తారన్నమాట. తాను అలా ఎందుకు హామీ ఇవ్వాల్సి వచ్చిందో కూడా జగన్ చెబుతున్నారు.
ధర్మవరంలో చేనేత కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో 35 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహిళలతో మాట్లాడిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారట. ఆ కుటుంబాలు పడుతున్న కష్టాలు చూసి 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట.మరి జనం ఈ జగన్ హామీని నమ్మితే పెద్ద ఎత్తున ఓట్లు పడే అవకాశం మాత్రం ఉంది. 2109లో టీడీపీ ఓడిపోవడం ఖాయం అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఏది ..ఏమైన రోజు ఒక్క హామితో జగన్ ప్రజల్లో స్థానం నిలుచుకుంటున్నాడు…మరోపక్క రోజు ఒక్క నేరంతో టీడీపీ నేతలు దొరికిపోతున్నారు.