తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తనయుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు సమయం కలిసి రావాలే కానీ హాట్ పాలిటిక్స్ నుంచి ఆఫ్ బీట్ కబుర్ల వరకు అన్నీ పంచుకుంటారనే సంగతి తెలిసిందే. అలా ముచ్చటించిన సందర్భంగా రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాలను కేటీఆర్ ఎన్నో వేదికల్లో పంచుకున్నారు. కొద్దికాలం క్రితం బీబీసీ తెలుగు చానల్కు ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు.
తాజాగా మరోమారు ఆయన అదే రీతిలో ట్విట్టర్ ద్వారా మనతో ముచ్చటించేందుకు సిద్ధమయ్యారు. `2017 సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా మనం ఎలాంటి అనుభూతులకు లోనయ్యామో తెలుసుకునేందుకు…ఇవాళ 8 గంటలకు ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో కనెక్ట్ అవుదాం` అంటూ మంత్రి ట్వీట్ చేశారు.