అవును మీరు చదివింది నిజమే. టీడీపీకి చేవలగల ఎంపీలు కావాలట. తెలంగాణ టీఆర్ఎస్ ఎంపీలను చూసి.. ఏపీ టీడీపీ ఎంపీలు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని, టీఆర్ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజలకు అనేక ప్రయోజనాలను చేకూర్చుతుంటే.. మరో పక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మాత్రం కేంద్ర ప్రభుత్వం వద్ద వారు చెప్పిన ప్రతీదానికీ తలలు ఊపుతూ.. ప్రజలకు శూన్యం మిగుల్చుతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదండి బాబోయ్.. సినీ క్రిటిక్, పవన్ ఫ్యాన్స్కు బాగా కావాల్సిన వ్యక్తి కత్తి మహేష్ అన్నవే.
కాగా, ఎప్పుడూ ఫేస్ బుక్తో బిజీ బిజీగా గడుపుతూ పవన్ను, పవన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెట్టే కత్తి మహేష్. ఈ సారి తన కామెంట్లను టీడీపీ ఎంపీల వైపు మళ్లించాడు. అయితే, కత్తి మహేష్ ఫేస్బుక్ వేదికగా టీడీపీ ఎంపీలపై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.