ఏపీ ముఖ్యమంతి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ,ముగ్గురు ఎంపీలను తమ పార్టీలోకి చేర్చుకున్న సంగతి తెల్సిందే.అంతే కాకుండా వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలకు ఏకంగా మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు .తాజాగా మరో ఎమ్మెల్యే మీద బాబు కన్నేశారు అని రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు .
అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్న బాపట్ల అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై టీడీపీ నేతల కన్ను పడినట్లు..అందుకు తగ్గట్లు చంద్రబాబు కింది స్థాయి నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు జిల్లా రాజకీయ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు.
అవసరమైతే కోట్లకు కోట్ల రూపాయలతో పాటుగా రాజధానిలో వర్కులు కూడా కేటాయిద్దాం అని బాబు చెప్పినట్లు సమాచారం .అయితే దీనిపై ఆయన స్పందిస్తూ పార్టీ మారాలని తనను సంప్రదించినట్లు వస్తున్న వార్తలు నిజమే .కానీ నా నా కంఠంలో ప్రాణం ఉండగా టీడీపీలో చేరను ..జగన్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకు కష్టపడతాను ..చంద్రబాబు అశచూపే తాయిలాలకు ఆశపడి నాపై జగన్ నా నియోజక వర్గ ప్రజలు పెట్టుకున్న ఆశలను వమ్ము చేయలేను అని ఆయన తేల్చి చెప్పారు ..