ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత,అనంతపురం పార్లమెంటు నియోజక వర్గ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఈ రోజు మంగళవారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ అవసరం, సందర్భాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అపాయింటుమెంట్ ఇస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం భేటీ అయి పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ప్రతిపాదనలపై చర్చించారు. గతంలో తాము ఇచ్చిన ప్రదిపాదనలను ఏం చేశారని ఎంపీలు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రైల్వే జోన్ విషయంలో ఏపీ ఎంపీలు ఏం చేయలేరని ఆయన అన్నారు. తాము చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు .ఎంపీలు అంటే కరివేపాకులా మారిపోయారని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మనిషికి కొంచెం భయం ఉంటే అన్నీ వస్తాయన్నారు. భయం లేకపోతే విచ్చలవిడితనం పెరుగుతుందని ఆయన ఘాటుగా స్పందించారు .