ప్రముఖ తెలుగు సినీ క్రిటిక్ కత్తి మహేష్.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫై అలాగే ఆయన అభిమానుల ఫై విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎడతెగని టీవీ చర్చలకు, వాదప్రతివాదాలకు దారితీస్తూ.. ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో టాలీవుడ్ మాటల రచయిత కోన వెంకట్ రంగంలోకి దిగారు. ఈ నెల 15 వరకు వేచిచూడాలని, అప్పటివరకు ఇటు కత్తి మహేశ్.. అటు పవన్ అభిమానులు మౌనంగా ఉండాలని కోన సూచించారు. దీంతో ఇరుపక్షాల మధ్య రాజీ కుదర్చడానికి తెరవెనుక సినీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్టు అప్పట్లో భావించారు. అయితే జనవరి 15వ తేదీ వెళ్లిపోయినా… వివాదం మాత్రం సమసిపోయినట్టు కనిపించడం లేదు.
ఇందుకు బలం చేకూర్చే మ్యాటర్ ఏంటంటే.. తాజాగా బుధవారం కోన వెంకట్కు కత్తి ఓ ట్వీట్ పెట్టాడు. ఎక్కడున్నారు సర్.. నేను మౌనంగా ఉన్నప్పటికీ నాతో పాటు నా కుటుంబానికి కూడా పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి వేధింపులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి… మీరేం చేయగలరు.. అని కత్తి మహేశ్ ట్వీట్లో తెలిపాడు. ఈ ట్వీట్కు వెంటనే కోన వెంకట్ రిప్లయ్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు నేను జనవరి 7న ట్వీట్ పెట్టిన తర్వాత కూడా నువ్వు ఇదే అంశం పై కొన్ని ఛానెళ్లతో మాట్లాడావు… పవన్ కల్యాణ్, అతని అభిమానులను ఎటాక్ చేసేందుకు పలు విద్యార్థి సంఘాలను కూడా రంగంలోకి దించావు… నీ డిక్షనరీలో మౌనానికి మరో అర్థం ఏదన్నా ఉందా.. అని కోన వెంకట్ తన ట్వీట్లో తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే పవన్ అభిమానులు, కత్తి మహేశ్ మధ్య గొడవకు ఫుల్స్టాప్ పెట్టేందుకు తెరవెనుక ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదా.. కేవలం పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా విడుదల సందర్భంగా రభస లేకుండా తాత్కాలికంగా వాయిదా వేసేందుకే కోన ఈ ట్వీట్ చేశారా.. ఇకముందు కూడా ఈ వివాదం కొనసాగబోతుందా.. అంటూ సోషల్ మాడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. కోన ట్వీట్కు కత్తి ఎలాంటి రిప్లై ఇస్తాడో అని సర్వాత్రా వెయిట్ చేస్తున్నారు.