ఏపీలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈనెల 22నగాని లేక 23వతేదీనగాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.`అంటూ ఎల్లో మీడియా చేసిన ప్రచారం…సోషల్ మీడియా సాక్షిగా సాగిన దుష్ప్రచారానికి చెక్ పడింది. స్వయంగా రాధా క్లారిటీ ఇచ్చారు. మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో చేరాల్సిన ఖర్మ పట్టలేదు.
ఇంకొక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తా` అని వంగవీటి రాధా దిమ్మతిరిగే స్పందనతో క్లారిటీ ఇచ్చేశారు. దీంతో పచ్చ బ్యాచ్ తేలు కుట్టిన దొంగలాగా మారిపోయింది.ఈ సందర్భంగా తన పొలిటికల్ జర్నీపై కూడా వంగవీటి రాధా క్లారిటీ ఇచ్చారు. ` వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా సోదరుడు. నా ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలొనే ఉంటాను.
2019లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిచి కృష్ణాజిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించేందుకు నా సర్వశక్తులు ఒడ్డుతాను` అని వంగవీటి రాధా స్పష్టం చేశారు. వైసీపీని వీడేది లేదని వంగవీటి రాధా తేల్చిచెప్పడంతో…ఇప్పుడు పచ్చబ్యాచ్ కిమ్మనకుండా ఉన్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.