Home / NATIONAL / బ్రేకింగ్ న్యూస్.. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ వేటు !

బ్రేకింగ్ న్యూస్.. 20 మంది ఎమ్మెల్యేలపై ఈసీ వేటు !

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఇదో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. వీరి పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కోరింది. . ఆ 20 మంది ఎమ్మెల్యేలు లాభదాయకమైన పదవుల్లో ఉన్నారంటో ఎన్నికల సంఘం ఆరోపించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అచల్ కుమార్ తన రిటైర్మెంట్‌కు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమస్యకు సంబంధించి ఎన్నికల సంఘం తన ప్రతిపాదనలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు చేరవేసింది. ఒకవేళ రాష్ట్రపతి ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే, త్వరలో ఢిల్లీలో మినీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.

2015లో ఆప్‌ ప్రభుత్వం 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన విషయం తెలిసిందే. దిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులకు గాను ఆప్‌కు 67 మంది ఉన్నారు. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ఆపద లేకపోయినప్పటికీ పార్టీకి మాత్రం పెద్ద ఎదురు దెబ్బేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు భాజపా వెల్లడించింది

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat