జబర్దస్త్ యాంకర్ రష్మి, ఈ షోలో స్కిట్లు చేసే టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ ఉన్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మీ-సుడిగాలి సుధీర్కు లింకుందని.. ఆతనితో డేటింగ్ చేస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇవన్నీ రూమర్లు కాదు నిజమేనని అనిపించేవిధంగా ఇద్దరూ ప్రవర్తిస్తుంటారు. మరో వైపు షోలో కూడా ఇతర టీమ్ సభ్యులు ఇద్దరి మధ్య ఏదో ఉందనే విధంగా తమ స్కిట్లలో కూడా సెటైర్లు వేస్తుంటారు. అంతే కాకుండా రష్మీ-సుధీర్ ల ప్రేమాయణం జబర్దస్త్ టీమ్ మొత్తానికి తెలిసిందేనని.. అందుకే అంత జోవియల్గా ఉంటున్నారని సమాచారం. అయితే తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని.. రూమర్స్ నమ్మొద్దని పైకి చెప్పినా.. తాజాగా లైవ్లో రష్మీ-సుధీర్లు అడ్డంగా బుక్ అయ్యారు.
అసలు మ్యాటర్ లోకి వెళితే తెలుగు బుల్లితెర పై అతి పెద్ద డ్యాన్స్ కాంపిటీషన్ షో ఢీ ప్రోగ్రాం ప్రస్తుతం పదవ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ డ్యాన్స్ షోలో జడ్జీలుగా శేఖర్ మాస్టర్, ప్రియమణి.., యాంకర్గా ప్రదీప్.., రష్మి, సుడిగాలి సుధీర్, హేమంత్, వర్షిణిలు టీమ్ లిడర్స్గా చేస్తున్నారు. ఇక తాజా షోలో ఒక కంటెస్టెంట్ ప్రదర్శన చూసి రష్మీ తెగ ఏడ్చేసింది. దీంతో దీంతో రష్మీ నువ్వు ఏడవకు.. నువ్వు ఏడుస్తుంటే చూడలేకపోతున్నానని సుధీర్ అనడంతో.. వెంటనే అక్కడున్న ప్రదీప్ నువ్వు రష్మీ ఏడిస్తే ఎందుకు చూడలేకపోతున్నావని ప్రదీప్ అడగ్గా.. ఏంటి భయ్యా కాబోయే లేడీస్ ఏడిస్తే ఎలా చూస్తామని చెప్పగా.. నువ్వు ఎవర్ని పెళ్లి చేసుకోబోతున్నావో క్లారిటీగా చెప్పు ఎందుకంటే నేను మా యూట్యూబ్ సోదరులు వెయిట్ చేస్తున్నామని ప్రదీప్ సెటైర్ వేస్తూ ప్రశ్నించాడు. దీంతో ఈ డ్యాన్స్ షో అయిపోగానే రష్మీకి తనకి పెళ్లి అని సుధీర్ సమాధానం ఇవ్వడంతో రష్మీతో సహా అక్కడ ఉన్నవారంతా షాక్ తిన్నారు. ఇక చివర్లో ఇక రష్మీ మాట్లాడుతూ సుధీర్ నేను కూడా నువ్వు బాధపడితే చూడలేను అని చెప్పి ఒక ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడంతో వీరి మధ్య ఎఫైర్ తీవ్రస్థాయిలో నడుస్తోందని మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.