దేశంలో ఎక్కడైన కామాంధుల చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వావి వరుసలు మరచి ..దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్నారు. తాజాగా ఓ గర్భిణిపై అత్యాచారనికి పాల్పడ్డారు.ఉత్తరప్రదేశ్లోని కచౌలా గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ 32 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 19 న ఉదయం గర్భిణి బహిర్భూమికి వెళ్లింది. దీన్ని అదనుగా తీసుకున్న కొంతమంది యువకులు.. ఆమెను అపహరించి, సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు.
మహిళ చేతులు, కాళ్లు కట్టేసి.. నోట్లో బట్టలు నోక్కి.. ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. బహిర్భూమికి వెళ్లిన గర్భిణి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిస్సహాయ స్థితిలో పడిఉన్న గర్భిణిని గుర్తించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.