అవును, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. అది చదివితే మీరు నవ్వు ఆపుకోలేరు. ఎన్నికలు జరిగిన ప్రతీసారి.. అబద్ధపు హామీలు గుప్పిండం.. ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు మీరే.. మాకు మేమే అన్న చందాన ప్రజలకు దూరంగా ఉండటం చంద్రబాబుకు అలవాటే అని చెప్పుకోవాలి. ఇందుకు కారణాలు లేకపోలేదు కూడాను.
ఇక అసలు విషయానికొస్తే.. గతంలో నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా పరిపాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడుకు కొత్త కోరిక పుట్టుకొచ్చిందట. తనకు ఏపీ ముఖ్యమంత్రి అన్న పిలుపుకంటే.. సీఈఓ ఆఫ్ ఏపీ అని
పిలిస్తేనే బాగుంటుందని తన సన్నిహితవర్గంతో చంద్రబాబు అన్నట్లు సమాచారం. అంతేగాక, తన మంత్రివర్గం చేత సీఈఓ ఆఫ్ ఏపీ అని పిలిపించుకున్నారట కూడాను. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడుల పేరిట పలు దేశాలకు తిరుగుతూ.. ఏపీకి రండి.. పెట్టుబడులు పెట్టండి అంటూ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి తిరుగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న కొత్త భవనాల డిజైన్ల ఎంపికలో సైతం తన కన్స్ర్టక్షన్ కన్సల్టెంట్ బ్రెయిన్ను ఉపయోగిస్తున్నారట. దీంతోపాటు చంద్రబాబు ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు కన్స్ర్టక్షన్ కన్సల్టెంట్గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే డిజిగ్నేషన్ చంద్రబాబు కొంప ముంచిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇలా రాష్ట్రానికి పెట్టుబడులు.. అమరావతి డిజైన్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇలా అన్ని బాధ్యతలు తీసుకున్నావు సరే.. ఒక్కటైనా పూర్తి చేశావా..? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల సంక్షేమాన్ని మరిచావే.. చంద్రబాబు అంటూ సోసల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా.. అభివృద్ధి అంటే ఏమిటో తనకు తెలియదనే రీతితో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రజలు పెదవి విరుస్తున్నారు.