తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంతో ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ లకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు.అందులో భాగంగా ఇటివల ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మాజీ సీనియర్ మంత్రి ఉమామాధవరెడ్డి తన తనయుడు సందీప్ రెడ్డితో సహా భారీ స్థాయిలో టీఆర్ఎస్ గూటికి చేరారు.
తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీకి చెందిన పలువురు నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ వైపు పరుగులు పెడుతుంది.
స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.అందుకే బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,పార్టీకి అండగా ఉండాలని నిర్ణయించుకొని పార్టీ మారాము అని వారు తెలిపారు ..