అవును, మీరు చదివింది నిజమే. పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సినిమా తీసే ప్రసక్తే లేదని అన్నాడట ఓ స్టార్ డైరెక్టర్. అతనే ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుల్లో ఎస్రాజమౌళి ఒకరు.
అయితే, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో, పవన్ కల్యాణ్ నటించిన చిత్రం అజ్ఞాతవాసి ఇటీవల విడుదల ఎంత పెద్ద డిజాస్టర్ టాక్ను మూటగట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతి సందర్భంగా అజ్ఞాతవాసి చిత్రం చూసిన రాజమౌళి తన సన్నిహితుల వద్ద పవన్ కల్యాన్, త్రివిక్రమ్ ల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
త్రివిక్రమ్ టేకింగ్, కథా రచన, అన్నీ బాగానే ఉన్నాయని, కానీ కథకు ఇంకాస్త పదును పెట్టుంటే బ్లాక్బస్టర్ మూవీ అయి ఉండేదని చెప్పాడట రాజమౌళి. అయితే, త్రివిక్రమ్ గత సినిమాలు (ఖలేజా మినహా) అన్నీ సూపర్డూపర్ హిట్లేనని కూడా చెప్పాడట. త్రివిక్రమ్ ఒక డైరెక్టర్గా సక్సెస్గల వ్యక్తి… మరో వైపు పవన్ కల్యాణ్ గురించి ఇండస్ర్టీ మొత్తం ఓ పెద్ద టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అదేంటంటే డైరెక్టర్ చెప్పింది కాకుండా.. తన ఇష్టమైన రీతిలో కథలో మార్పులు చేర్పులు చేస్తుంటాడని టీఎఫ్ఐ టాక్. ఇలా త్రివిక్రమ్ స్టోరీ లో పవన్ వేలుపెట్టడం వల్లే అజ్ఞాతవాసి బోల్తా కొట్టిందంటూ తన సన్నిహితుల వద్ద ఎస్.ఎస్. రాజమౌళి అన్నాడట. మరి హిట్లు మీద హిట్లు కొట్టుకుంటూ తనకంటూ ఓ స్టార్ డైరెక్టర్గా ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న రాజమౌళి.. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్తో సినిమా తీయకపోవడానికి కారణం అదేనంటూ సినీ జనాలు చర్చించుకుంటున్నారు.