వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి పనిచేస్తామని తేల్చి చెప్పిన సంగతి తెల్సిందే .అయితే జగన్ ప్రస్తుతం చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నాయి.అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో మిత్రపక్షాలైన టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు జగన్ బీజేపీ పార్టీతో కల్సి పని చేస్తాను అని చెప్పడం రాజకీయ వ్యభిచారమే అని టైపులో పంచుల మీద పంచులు వేస్తూ విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.ఇక బీజేపీ పార్టీకి చెందిన నేతలు తాము ఎమన్నా తక్కువ తిన్నామా అని తెగ రెచ్చిపోతున్నారు.బీజేపీ పార్టీకి చెందిన మంత్రి కామినేని జగన్ అవినీతి పరుడు .
అలాంటివాడితో మేము కల్సి పని చేయము అని విమర్శలు కురిపించారు.ఇక బీజేపీ ఎమ్మెల్సే సోము వీర్రాజు జగన్ ప్రత్యేక హోదా ఇస్తే తమతో కల్సి పనిచేస్తామని అనడం రాజకీయాలకోసం దాన్ని వాడుకోవడమే .అయిన ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం .దాని గురించి జగన్ ఎందుకు అంత ఆరాట పడుతున్నాడో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు ..