ఏపీలో అనంతపురం రాజకీయాలు తెల్సిన ఎవరిని అడిగిన చెప్తారు వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలు గురించి.అనంతపురం జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో..20 రోజులకు పైగా 250 కిలో మీటర్లు వైఎస్ జగన్ ప్రజా సమస్యలు ,స్వయంగా తెలుసుకోవడం కోసం చేపట్టిన ప్రజా సంకల్పా యాత్ర సాగింది.
2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాతి నుండే జగన్ ఈ జిల్లా పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రైతు పరామర్శ యాత్రలు చేసారు. అనంతపురం లోనే యువభేరీ నిర్వహించారు. ధర్మవరంలో నిర్వహించిన చేనేత సదస్సు కు భారీ స్పందన కనిపించింది.
దీంతో..రాయలసీమ లో TDPకి బలంగా ఉన్న నియోజకవర్గాలు..ఆ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇతర పార్టీల జెండా ఎగరని గ్రామాలను ఈ సారి జగన్ తన పాదయాత్రతో వైసీపీ జెండా వైపు చూసేలా చేశారు. ప్రతీ గ్రామంలో YCP జెండా ఎగరేసేలా పాదయాత్ర చేశారు. వాటిలో ముఖ్యమైనవి 2019 లో గెలుస్తాది అని బలంగా నమ్ముతున్న నియోజకవర్గాలు.
1.కదిరి
2.పుట్టపర్తి
3.ధర్మవరం.
4.గుంతకల్.
5.రాప్తాడు.
6.హిందూపురం.(బాలయ్య కి సీట్ ఇస్తే కచ్చితంగా ఓడిపోతాడు అని టీడీపీ నే చెప్తుంది)
7.సింగనమల.
అయితే జనసేనా అధినేత ఎలాంటి రాజకీయం చేస్తున్నాడో బట్టబయల్యైంది. ఈరోజు నుండి పవన్ చేయబోయే అనంతపురం పర్యటనలో వీటిలో ఎన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తాడో చూడండి.జనసేన రాజకీయ విధానం ఎలా ఉంటాదో తెలుసుకోడానికి ఇది ఒక శ్యాంపుల్ మాత్రమే.ముసుగు విడిపోయింది పవన్ కళ్యాణ్ రాజకీయ విధానం ఏంటో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు తెలుసుకోవల్సిన రాజకీయం ఎలా ఉందో తెలుసుకోని..రైతులకు ,నిరుద్యోగులకు , పెదవారికి 2019లో ఎవ్వరైతే న్యాయం చేయ్యగలరు….2014లో గెలిపించినందకు ఏం చేశారో ఆలోచించి మీ విలువైన ఓటుతో సమధానం చెప్పండి.