కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టారు.అయితే ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సమయంలో కొన్ని వస్తువుల ధరలు పెరగడం ..తగ్గడం మనం చూస్తూనే ఉన్నాం ..అయితే ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి ..ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో ఒక లుక్ వేద్దాం ..
ధరలు పెరిగేవి ..
ఎలక్ట్రానిక్ వస్తువులు ..మొబైల్ ఫోన్లు ..మోటార్ బైకులు ..స్మార్ట్ వాచీలు ,ఎల్ఈడీ పరికరాలు ..
ట్రక్కులు ,రేడియల్ టైర్లు ..మొబైల్ ఫోన్ కు సంబంధించిన విడి భాగాలు..అలారం గడియారాలు .
స్టాఫ్ వాచీలు ..పాకెట్ వాచీలు ..చేతి గడియారాలు ..
బంగారం ..వెండి ..ఇమిటేషన్ జ్యుయలరీ ,పలు రకాల రంగు రాళ్ళూ ..
చెప్పులు ..సిల్క్ వస్త్రాలు ..టూత్ ఫెస్టులు ..
దిగుమతి చేసుకునే కూరగాయలు ..పండ్ల రసాలు ..వెజిటబుల్ ఆయిల్ ,వేరుశనగ ,అలీవ్ ,కొబ్బరి నూనె ..
ఫర్నిచర్ ,పరుపులు ,పడక మంచాలు ..
బ్యూటీ ఫ్లార్లర్ కి సంబంధించిన వస్తువులు .. షేవింగ్ ఉత్పత్తులు .. పాన్ మసాలా, బీడీ, సిగరెట్ లైటర్లు, క్యాండిల్స్
గాలిపటాలు, సన్గ్లాసెస్.. వీడియో గేమ్స్, పిల్లలు ఆడుకునే క్రీడా వస్తువులు
ధరలు తగ్గేవి ..
ముడి జీడిపప్పు..పెట్రోల్, డీజిల్..సోలార్ టాంపర్డ్ గ్లాస్, సోలార్ ప్యానెళ్లలో ఉపయోగించే టాంపర్డ్ గ్లాస్
వినికిడి పరికరాల తయారీకి అవసరమయ్యే ముడి వస్తువులు