Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం…ఎమ్మెల్యే గౌరు చరిత

చంద్ర‌బాబు కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం…ఎమ్మెల్యే గౌరు చరిత

అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు మా జిల్లాకు టీడీపీ న్యాయం చేయ్య‌డం లేద‌ని వైసీపీ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కేసీ కెనాల్‌ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. శ్రీశైలంలో 858 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ జిల్లా రైతులకు చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు.

see also..

ముచ్చుమర్రి నుంచి కేసి కేనాల్‌కు నీటిని నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. తుంగభద్ర నుంచి నీటి వాటా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. శ్రీశైలం నిల్వ జలాల పంపిణీలో కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేసీ కెనాల్ కింద వేల ఎకరాల్లో పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. అందుకే జనమంతా వైయస్ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు క‌ర్నూలు జిల్లాలో ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరినా జనం మాత్రం జననేత వైయస్ జగన్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని గౌరు చ‌రిత స్పష్టం చేశారు. ఇంకా దారుణంగా చెప్పాలంటే రాయలసీమకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat