కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 ఏడాదికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సంగతి తెల్సిందే .ఈ బడ్జెట్ పై ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఆ పార్టీ అధ్యక్షుడు మొదలు నేత వరకు అందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు .తాజాగా ఆ పార్టీ ఎంపీ టీజీ వెంకటేష్ మీడియా ముందు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది.రాష్ట్రానికి రావాల్సిన నిధులు ,ప్రత్యేక ఫ్యాకేజీ ,విశాఖకు రైల్వే జోన్ లాంటి తదితర అంశాలపై కేంద్రం అలసత్వం ప్రదర్శించింది.దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పడంలో సిద్ధ హస్తుడైన ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ్ని కేంద్రం తక్కువ అంచనా వేస్తుంది.ఒంటరిగా మెజారిటీ సీట్లు ఉన్నాయని తల పోగర్ను మోదీ చూపిస్తున్నారు .
see laso..జగన్ సై అంటే చిత్తూరు నుండి పోటి చేస్తానంటున్న స్టార్ హీరో…
ఏపీలో టీడీపీదే పై చెయ్యి ..బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మూడో కూటమిను ఏర్పాటు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య .బాబు ఓకే అంటే ఇప్పుడే ఎంపీలు ,కేంద్ర మంత్రులు రాజీనామాకు సిద్ధమవుతారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .రాష్ట్రానికి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా రాజీనామా చేసి తీరుతాం అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఏపీ పాలిటిక్స్ వర్గాల్లో రాజకీయం హీటేక్కింది ..