టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, స్టార్ హీరో ప్రభాస్ల ప్రేమాయణం ఈనాటిది కాదు. వీరిద్దరి కలయికలో వచ్చిన బిల్లా చిత్రం నుంచి వీరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. కూస్తోంది కూడాను. ఇప్పటి వరకు చాటుమాటు వ్యవహారం నడిపిన వీరు ఇప్పుడు బరితెగించారని అంటున్నారు సినీ జనాలు.
ఇక అసలు విషయానికొస్తే. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి అనుష్క తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంది. అదే కార్యక్రమానికి రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరయ్యాడు. ఇదిలా ఉండగా అనుష్క ప్రభాస్ను చూడగానే ఒక్కసారి ఆనందం ఆపుకోలేక అందరిముందే.. అది కూడా తన కుటుంబ సభ్యుల ముందే హగ్ చేసుకుంది. అలా చాలా సేపు ప్రభాస్ కౌగిట్లోనే ఉండిపోయింది అనుష్క. అంతటితో ఆగక ప్రభాస్ను ఓ ప్రైవేటు రూంకు తీసుకెళ్లి తన చేతులతోనే దోసెలు వేసి ప్రభాస్కు కొసరి కొసరి తినిపించింది అనుష్క. వీరి బంధం ఈ నాటిది కాదు.. జన్మ జన్మల బంధమైనట్లుందే అటూ చర్చించుకోవడం ఫంక్షన్కు హాజరైన వారి వంతైంది.