తెలంగాణ రాష్ట్రంలో మంథని నియోజక వర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పుట్ట మధు గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు .రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన కాటారం మండలంలో ఓడిపలవంచ గ్రామానికి చెందిన వి.దేవేందర్ ప్రమాదశావత్తు తన కాళ్ళను కోల్పోయాడు.గతంలో కాంగ్రెస్ సర్కారు హయంలో ఎన్ని సార్లు అధికారుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది .అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెలిచిన పుట్ట మధు ను కలవడంతో తమ్ముడు నువ్వు అధైర్యపడకు.నీకు నేనున్నాను అని భరోసా కల్పించాడు.అంతే కాకుండా హైదారబాద్ మహానగరంలో నిమ్స్ కు పంపించి అక్కడి వైద్యులను సంప్రదించి సరైన వైద్యం అందించాలని కోరారు .అంతే కాకుండా కృత్రిమ కాళ్ళను ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యక్తిగత కార్యదర్శితో మాట్లాడి మొత్తం మూడు లక్షల యాబై వేల రూపాయల ఎల్వోసీ ను ఇప్పించడం జరిగింది .దీంతో దేవేందర్ కుటుంబం ఎమ్మెల్యే పుట్ట మధుపై ప్రశంసల వర్షం కురిపించి ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకున్నారు .