ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. సమస్యలకు పరిష్కార మార్గాలను రచిస్తూ.. ప్రజల్లో భరోసా నింపుతూ ముందుకు సాగుతున్నారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఇటీవలే 1000 కిలోమీటర్ల పైచిలుకు మార్క్ను దాటింది. అయితే, జగన్ ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రలో.. తాము సైతం అంటూ మహిళలు, యువత, వృద్ధులతోపాటు దివ్యాంగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. తమకు ఎంత కష్ట మైనా సరే.. వైఎస్ జగన్ను సీఎంగా చూసేందుకు ఎంత దూరమైనా వస్తామని చెప్తున్నారు. అయితే నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం దేవరపాలెంలో ఆర్యవైశ్యులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడారు.
see also..ఓ బాలుడు రోడ్డు పక్కన యాంకర్ అనసూయ కనిపించగానే..ఏం చేశాడో తెలుసా..!
ఆర్యవైశ్యుల సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) దాడులు పెరుగుతున్నాయని ఆర్యవైశ్యులు చెబుతున్నారని, ఆర్యవైశ్యులను అనుమానిస్తే దేశం ముందడుగు వేయదని అన్నారు. పేదరికానికి కులం, మతం లేదని అన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఆర్యవైశ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మరోపక్క ఓ మహిళ అడిగిన ప్రశ్నకు ఫిరాయింప్ ఎమ్మెల్యేలకు గట్టి తగిలిందని..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ మహిళ ఏం అడిగిదంటే..జగన్ అన్న మేము నీకే ఓటు వేస్తాం ..మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూస్తాం..కాని పార్టీ ఫిరాయిస్తుంటే ..మేము ఏం చెయ్యాలి అని ఆమె న్నారు…ప్రస్తుతం ఆమె మాటలు నెటిజన్లను ఆలోచింపజేస్తుంది.ఈ క్రింది వీడియో మీరు చూడండి..