Home / ANDHRAPRADESH / గాలి ముద్దు కృష్ణమ చనిపోయే కలవరించింది ఇతన్నే ..ఎవరతను ..ఎందుకు ?

గాలి ముద్దు కృష్ణమ చనిపోయే కలవరించింది ఇతన్నే ..ఎవరతను ..ఎందుకు ?

టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు అనారోగ్యానికి గురై హైదరాబాద్ మహానగరంలో ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెల్సిందే.అయితే గాలి ముద్దు కృష్ణమ నాయుడు చనిపోయే చివరి రోజుల్లో ఒక వ్యక్తి గురించి తెగ కలవరించాడు అని గాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇటివల తన గుండెకు సర్జరీ చేయించుకున్న గాలి నివాసాన్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు.అప్పటి నుండి గాలి ఒక వ్యక్తి గురించి తెగ కలవరించారు.

see also : వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తానో చెప్పిన కేటీఆర్‌

అతనే దాదాపు రెండు దశాబ్దాల పాటుగా తనతో ట్రావెల్ చేయడమే కాకుండా తనని ఎక్కడకి అంటే అక్కడికి చాలా సురక్షితంగా తీసుకెళ్ళిన డ్రైవర్ చంద్ర.గత వారం జ్వరంతో ఉన్న గాలిని రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్ళి మరి హైదరాబాద్ వెళ్ళే విమానాన్ని ఎక్కించారు.ఆ తర్వాత నగరంలో కిమ్స్ లో చేరిన ఆయన డెంగ్యూ జ్వరానికి చికిత్స పొందుతూ తన కుటుంబ సభ్యులతో చంద్రను పిలవండి ..వాడ్ని చూడాలని ఉంది అనే విషయాన్నీ ఆస్పత్రిలో చాలా సార్లు చెప్పారు అంట .

అయితే ఈ విషయాన్నీ చంద్రకి చెప్పడంతో హుటాహుటిన మంగళవారం హైదరాబాద్ కు వచ్చారు.అయితే అప్పటికే గాలి అపస్మారక స్థితిలోకి వెళ్ళడంతో చివరిగా చంద్రను గాలి చూడలేకపోయారు.అయితే తనను ఎంతగానో కలవరించిన గాలి మరణించిన తర్వాత అక్కడకి వచ్చి ‘అయ్యా లే అయ్యా నీకోసం ఎంతమంది వచ్చారో చూడయ్య అని అంటూ చంద్ర విలపిస్తున్న తీరుకు అక్కడ ఉన్నవారికి కన్నీళ్ళతో అందరి హృదయాలను పిండేసింది.

see also : ఏపీ బంద్‌లో పాల్గొన్న జగన్‌..!

see also : అభిమాని ఫ్యామిలీకి ఇల్లు క‌ట్టించిన రాఘవ లారెన్స్

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat